
- స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
జనగామ, మన చౌరాస్తా : అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను గడపగడపకు వెళ్లి వివరించాలని బీఆర్ఎస్ క్లస్టర్ ఇన్చార్జీలు పిలుపునిచ్చారు. జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు క్లస్టర్ ఇంచార్జీలు మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి ప్రేమలత రెడ్డి, కౌన్సిలర్లు పేర్ని స్వరూప, అనిత, మాజీ మార్కెట్ డైరెక్టర్ సెవెల్లి మధు, యూత్ ప్రెసిడెంట్ ఉల్లెంగుల సందీప్ సోమవారం జనగామ మండలంలోని అడవికేశవపూర్, పెద్దతండా (ఎం )గ్రామాల్లో గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలతో సన్నహాక సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించడంతో పాటు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ లను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఎండగట్టాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు సాధించేలా కార్యకర్తలు కృషి చేయాలని తెలిపారు.