
- వరద ఉధృతితో నిలిచిన వాహనం..
గన్నేరువరం, మన చౌరాస్తా : కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రం గన్నేరువరం ఊర చెరువు మత్తడి ప్రవాహం ఎక్కువై రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో మండల కేంద్రంలో పెళ్లికి చేరుకోవలసిన పెళ్లి కొడుకు పాట్లు తప్పలేదు. వరద ఉధృతికి వాహనం నిలిపివేశారు. నాలుగు గంటల వేచి చూసి విధి లేని పరిస్థితిలో బంధువులు పెళ్లికొడుకును భుజాలపై మోసుకుంటూ అవతలి ఒడ్డుకు చేర్చి మరో వాహనంలో తీసుకొని వెళ్లారు. లో లెవెల్ కల్వర్టు సమస్యతో గన్నేరువరం మండల ప్రజలు ప్రతి సంవత్సరం ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని మండల ప్రజలు వేడుకుంటున్నారు.