
- పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
ములుగు, మన చౌరాస్తా : రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కరించేందుకు ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. శుక్రవారం తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ (టిఎస్ జెయు) ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు.
ఈ కార్యక్రమంలో టిఎస్ జెయు రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం నారగౌని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్, ఎన్ యుజె (ఐ) జాతీయ కార్యదర్శి మెరుగు చంద్రమోహన్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీలు పావుశెట్టి శ్రీనివాస్, నాగపురి నాగరాజ్, ములుగు జిల్లా అధ్యక్షుడు చల్లగురుగుల రాజు, ప్రధాన కార్యదర్శి రంజిత్ కుమార్, ఉపాధ్యక్షుడు నాగపురి హరినాథ్ గౌడ్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు కందికొండ మోహన్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు రాము, జాయింట్ సెక్రెటరీ దాడి బిక్షపతి, జనగామ జిల్లా అధ్యక్షుడు ఉప్పలంచి నరేందర్, మహబూబ్ బాద్ జిల్లా అధ్యక్షుడు ఉదయ్ ధీర్, భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంతోష్, కార్యదర్శి దొమ్మాటి రవి, ఉపాధ్యక్షుడు బండారి రాజు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా సమావేశం ములుగులో జరిగింది. టిఎస్ జెయు రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా మాట్ల సంపత్, కార్యవర్గ సభ్యులుగా గండ్రాతి విజయాకర్, టిఎస్ జెయు మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మందాటి రజిని, ఉపాధ్యక్షురాలిగా పోచంపల్లి రజిత శ్రీనివాస్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.